పెరిగిన వ్యవసాయ కార్మికుల ద్రవ్యోల్బణం..!
మేలో వరుసగా 2.94 శాతం
గ్రామీణ కార్మికల విషయంలో ధరల స్పీడ్ 3.12 శాతం
న్యూఢిల్లీ: వ్యవసాయ, గ్రామీణ కార్మికులకు సంబంధించి ద్రవ్యోల్బణం మే నెల్లో స్వల్పంగా పెరిగింది. కార్మిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... వ్యవసాయ కార్మికుల వినియోగ ధరల సూచీ (సీపీఐ–ఏఎల్) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 మేలో 2.94 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) ఉంది.
- ఏప్రిల్లో ఈ రేటు 2.66 శాతం.
- ఇక గ్రామీణ కార్మికుల వినియోగ ధరల సూచీ (సీపీఐ–ఆర్ఎల్) ఆధారిత ద్రవ్యోల్బణం తాజా సమీక్షా నెల్లో 3.12 శాతం. ఏప్రిల్లో ఈ ధరల వేగం 2.94 శాతం.
- మేలో ఒక్క ఫుడ్ ఇన్ఫ్లెషన్ తీసుకుంటే, సీపీఐ–ఏఎల్ 1.54 శాతంగా ఉంటే, పీపీఐ–ఆర్ఎల్ విషయంలో ఈ రేటు 1.73 శాతం.
మరిన్ని వార్తలు