
సాక్షి, హైదరాబాద్: హ్యూలెట్ప్యాకర్డ్ (హెచ్పీ) సంస్థ..‘హెచ్పీ స్మార్ట్ట్యాంక్’ పేరుతో బుధవారం సరికొత్త ప్రింటర్లను విడుదల చేసింది. సులువుగా వా డు కోగలగడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సురక్షితం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా తయారైన ఈ కొత్త ప్రింటర్లు ప్రస్తుతం మూడు మోడళ్లలో లభిస్తున్నట్లు హెచ్పీ ప్రింటింగ్ విభాగం ప్రెసిడెంట్ సునీశ్ రాఘవన్ తెలిపారు.
హెచ్పీ స్మా ర్ట్ ట్యాంక్ 521 కేవలం ప్రింటింగ్కు ఉపయోగపడుతుందని, హెచ్పీ 510, హెచ్పీ 580లు ప్రింట్, స్కానింగ్, కాపీ పనులు చేయగలవ ని చె ప్పారు. ఈ మూడు మోడళ్ల ధరలు రూ. 13,000 –19,000 మధ్యలో ఉంటాయని ఆయన తెలిపారు.