
సాక్షి,ముంబై: ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్) ఖాతాదారులకు శుభవార్త. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతంగా వడ్డీ రేటునే నిర్ణయించింది. 0.05 శాతం పెంచి 8.10 శాతం నుండి 8.15 శాతానికి పెంచింది. 2019 తర్వాత పెంపు ఇదే తొలిసారి సీబీటీ నిర్ణయాన్ని 2022-23కి సంబంధించిన ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు అనుమతికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది. మార్చి 27, 28 తేదీల్లో సమావేశమైన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.