
దీపావళి సమీపిస్తోంది, బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా ఏ మాత్రం తగ్గకుండా భారీగా పెరిగిన ధరల కారణంగా గోల్డ్ రూ. 80వేలకు చేరువయ్యింది. ఇదిలాగే కొనసాగితే.. పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు (మంగళవారం) దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం..
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్, బెంగళూరు, ముంబైలలో.. నేడు 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 73,000 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.79,640 వద్ద ఉంది. నిన్నటి ధరలు పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అంటే ఈ రోజు గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయన్నమాట.
చెన్నైలో కూడా గోల్డ్ రేటు ఈ రోజు నిశ్చలంగా ఉంది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,000 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,640 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగినట్లు స్పష్టమవుతోంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,150 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,790 వద్ద ఉంది.
ఇదీ చదవండి: నెట్టింట్లో చర్చకు దారితీసిన ట్వీట్
వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్న, ఈ రోజు వెండి ధర రూ. 2500 పెరిగింది. దీంతో నేడు కేజీ సిల్వర్ రేటు రూ. 10,2000లకు చేరింది. వచ్చే వారమే పండుగ కాబట్టి ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).