అమ్మకానికి ‘ఎనిమీ ప్రాపర్టీ’ షేర్లు | Centre plans to sell enemy property shares in 84 firms | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ‘ఎనిమీ ప్రాపర్టీ’ షేర్లు

Jan 12 2024 4:55 AM | Updated on Jan 12 2024 4:55 AM

Centre plans to sell enemy property shares in 84 firms - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా 84 కంపెనీల్లోని 2.91 లక్షల ’ఎనిమీ ప్రాపరీ్ట’ షేర్లను విక్రయించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 20 కంపెనీల్లో 1.88 లక్షల షేర్లను విక్రయించనుంది. ఇందుకోసం 10 కేటగిరీల కొనుగోలుదార్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో వ్యక్తులు, ప్రవాస భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌), అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదార్లు, ట్రస్టులు, కంపెనీలు ఉన్నాయి.

ఫిబ్రవరి 8 కల్లా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. 1947–1962 మధ్య కాలంలో శతృదేశాలైన పాకిస్తాన్, చైనాకు వెళ్లిపోయి, అక్కడి పౌరసత్వం తీసుకున్న వారికి భారత్‌లో ఉన్న ఆస్తులను ’ఎనిమీ ప్రాపరీ్ట’గా వ్యవహరిస్తారు.

ఇవి కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీస్‌ ఫర్‌ ఇండియా (సీఈపీఐ) అ«దీనంలో ఉన్నాయి. బిడ్డర్లు తమకు ఏ కంపెనీల్లో ఎన్ని షేర్లు, ఏ ధరకు కావాలనేది బిడ్‌లో తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒకో కంపెనీ షేర్లకు నిర్దిష్ట ధరను రిజర్వ్‌ రేటుగా నిర్ణయిస్తుంది. దీన్ని వెల్లడించదు. అంతకన్నా తక్కువ రేటు కోట్‌ చేసే బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఈ ప్రక్రియకు మర్చంట్‌ బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది.   

Advertisement
 
Advertisement
Advertisement