రూపే కార్డుల ప్రోత్సాహానికి రూ. 2,600 కోట్ల స్కీం!

Bhim Upi Transactions: Cabinet Approves 2600 Crores Scheme To Promote Rupey Debit Card - Sakshi

న్యూఢిల్లీ: రూపే డెబిట్‌ కార్డులు, తక్కువ విలువ చేసే భీమ్‌–యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర క్యాబినెట్‌ బుధవారం రూ. 2,600 కోట్ల స్కీముకు ఆమోదముద్ర వేసింది. దీని కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూపే కార్డులు, యూపీఐని ఉపయోగించి జరిపే పాయింట్‌ ఆఫ్‌ సేల్స్, ఈ–కామర్స్‌ లావాదేవీలను ప్రోత్సహించినందుకు గాను బ్యాంకులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. 

అనగా కేంద్రం ఈ పథకం కింద బ్యాంకులకు ఆర్థికసాయాన్ని అందివ్వనుంది. ఈ పథకం ద్వారా బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా వృద్ధి చెందాలని భావిస్తోంది.  వినియోగదారులు వ్యాపారులకు తక్కువ విలువ గల పేమెంట్స్‌ను పోత్సహిస్తుంది. యూపీఐ లైట్​, యూపీఐ123పే ద్వారా డిజిటల్​ చెల్లింపులను ప్రమోట్​ చేస్తుంది. ఈ పథకంతో భారత్​ డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో ముందడుగు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

చదవండి: టాలెంట్‌ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top