సీపీఎస్‌ రద్దు చేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు చేయాలని ధర్నా

Sep 2 2025 7:10 AM | Updated on Sep 2 2025 7:10 AM

సీపీఎస్‌ రద్దు చేయాలని ధర్నా

సీపీఎస్‌ రద్దు చేయాలని ధర్నా

టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో

భారీ మోటారు సైకిల్‌ ర్యాలీ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)ను రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ టీపీఈజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు పాల్వంచ బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ఐడీఓసీ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ అమరనేని రామారావు, సెక్రటరీ జనరల్‌ సంగెం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల, ప్రభుత్వ నిధులను షేర్‌మార్కెట్‌కు తరలిస్తూ నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ఇతర కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement