జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ

Apr 20 2025 1:05 AM | Updated on Apr 20 2025 1:05 AM

జేఈఈల

జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ

ఆలిండియాస్థాయిలో 385వ ర్యాంక్‌

పాల్వంచరూరల్‌: తాపీ మేసీ్త్ర కుమారుడు జేఈఈ మొయిన్స్‌ పరీక్షలో ఆలిండియా ర్యాంక్‌ సాధించాడు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన బోగి లక్ష్యయ్య, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. తండ్రి తాపీమేసీ్త్రగా పనిచేస్తూ పిల్లలను ప్రైవేట్‌ కళాశాలల్లో చదివిస్తున్నాడు. పెద్ద కుమారుడు సంతోష్‌ కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివాడు. ఇటీవల జేఈఈ మెయిన్స్‌ పరీక్ష రాయగా, ఆలిండియా స్థాయిలో 385 ర్యాంక్‌ వచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.

రహదారిపై ధాన్యం..

బస్తాలకు ఎత్తిన పోలీసులు

అశ్వాపురం: మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ రైతు ట్రాక్టర్‌లో ధాన్యాన్ని మార్కెట్‌కు తరలిస్తూ కొత్తగూడెం వైపు వెళ్తున్నారు. మండల పరిధిలోని గొల్లగూడెం వద్ద ట్రాక్టర్‌ను గుర్తు తెలియని వాహనం స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో సుమారు 10 బస్తాల ధాన్యం రహదారిపై పడిపోయింది. సుమారు రెండు, మూడు బస్తాల ధాన్యం పిండి అయింది. రహదారిపై వెళ్తున్న వాహనాలతో ధాన్యం పిండి అవుతుండగా ఆ సమయంలో పెట్రోలింగ్‌ చేస్తూ అశ్వాపురం వైపు వెళ్తున్న ఏఎస్సై రామచంద్రారెడ్డి, పెట్రోలింగ్‌ సిబ్బంది ఆగి వాహనాలు ధాన్యం ఎక్కకుండా చూసి ధాన్యం బస్తాలలో ఎత్తి రైతుకు సహకరించారు. ధాన్యం బస్తాలకు ఎత్తి సహకరించిన ఏఎస్సై, సిబ్బందికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

మొక్కల సంరక్షణపై

శ్రద్ధ పెట్టాలి

జూలూరుపాడు: మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె మండలంలోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ, అటవీ నర్సరీలను సందర్శించారు. అనంతరం మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఎంపీడీఓ డి.కరుణాకర్‌ రెడ్డి, ఎంపీఓ టి తులసీరామ్‌, తాళ్లూరి రవి, ఏపీఓ రవికుమార్‌, హనుమంతు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

డీపీఓను కోరిన ఎమ్మెల్యే ఆదినారాయణ

అశ్వారావుపేటరూరల్‌: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ డీపీఓ చంద్రమౌళిని కోరారు. ఇందిరా బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు జీపీ కార్యదర్శి రజిని సమస్యలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. కాగా, ఎమ్మెల్యే పర్యటనకు కూడా హాజరు కాలేదు. దీంతో గ్రామస్తుల సమక్షంలోనే ఎమ్మెల్యే డీపీఓతో ఫోన్‌లో మాట్లాడి కార్యదర్శిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

సైబర్‌ కేసు నమోదు

పాల్వంచరూరల్‌: స్మార్ట్‌ఫోన్‌లో అపరిచితుడు పంపిన లింక్‌ ఓపెన్‌ చేసి ఓ యువకుడు రూ. 35 వేలు పోగొట్టుకున్నాడు. మండల పరిధిలోని పునుకుల గ్రామానికి చెందిన ఎస్‌కె.మహబూబ్‌ గతేడాది అక్టోబర్‌ 30న తన ఫోన్‌కు అపరిచితుడు పంపిన లింక్‌ను ఓపెన్‌ చేశాడు. దీంతో బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ.35 వేలను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. బాధితుడు శనివారం ఫిర్యాదు చేయగా, సైబర్‌ నేరం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ1
1/3

జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ

జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ2
2/3

జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ

జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ3
3/3

జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement