కారు ఢీకొని ఒకరికి గాయాలు

అన్నపురెడ్డిపల్లి: మండలంలోని బూర్గుడెం గ్రామంలో మంగళవారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం... బూర్గుడెం గ్రామానికి చెందిన ఎస్‌డీ అబ్బాస్‌ పొలం పనులు ముగించుకుని ఎడ్లబండిపై ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో కొత్తగూడెం నుంచి వీఎం బంజర్‌ వైపు వెళ్తున్న కారు వెనుకవైపు నుంచి ఎడ్లబండిని ఢీకొట్టింది. దీంతో అబ్బాస్‌తోపాటు ఒక ఎద్దుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై షాహీనా పరిశీలించారు.

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top