సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్లో 2016–17లో ముగ్గురికి గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా చేశాం. బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండెను జీజీహెచ్కు తీసుకొచ్చి గుండె ఫెయిల్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చి నూతన జీవితాలను ప్రసాదించాం. పలు ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 60 మందికి గుండె మార్పిడి ఆపరేషన్లు, పది మందికి ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్లు చేసి నూతన జీవితాలను ప్రసాదించాం. ప్రతి ఒక్కరూ అవయవదానం చేసి మరణానంతరం తిరిగి జీవించవచ్చు.
–డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, సీనియర్ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు


