రెడ్డెమ్మా..చల్లంగా చూడవమ్మా | - | Sakshi
Sakshi News home page

రెడ్డెమ్మా..చల్లంగా చూడవమ్మా

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడవమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయానికి ఆదివారం ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన వారు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.హిందువులతో పాటు ముస్లింలు అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement