
పులకించిన గండిక్షేత్రం
చక్రాయపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధి శ్రావణ మాసం నాలుగో శనివారోత్సవం సందర్భంగా భక్తులతో పులకించిపోయింది. రాయలసీమ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం దాతలు పెద్ద ఎత్తున అన్నదానాలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజ పాలకమండలి సభ్యులుతో పాటు,ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య,ఆర్కేవ్యాలీ, ఎస్సై రంగారావు ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు నిర్వహించారు.సాంస్కృతిక కార్యక్రమాలు అలరింప జేశాయి. ఆలయ ప్రధాన,ఉప ప్రధాన, అర్చకులు కేసరి,రాజారమేష్, రఘుస్వామి, వేదపా రాయణం రామ మోహణ శర్మలు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు.

పులకించిన గండిక్షేత్రం