
● ఎమ్మార్పీ ధరలకు మంగళం
సాక్షి రాయచోటి: రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్లు ఆర్థికంగా బలపడేందుకు అక్రమార్గాల్లో ముందుకు పోతున్నారు. అధికారంలో ఉండగానే అన్నీ చక్కబెట్టుకోవాలన్నట్లు అవకాశం ఉన్న ప్రతి అంశంపై కన్నేస్తున్నారు. ప్రధానంగా ఇసుక, మద్యం, మట్టి, గ్రావెల్ ఇలా అన్నింటిలోనూ దోపిడీకి స్కెచ్ వేశారు.అయితే మద్యం దుకాణాలు జిల్లాలో ఎక్కువ శాతం కూటమి సర్కార్లోని సంబంధీకులకే రావడంతోవారు ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూములకు అనుమతులు లేవని...బెల్ట్ షాపులను లేకుండా చేస్తున్నామని పేర్కొంటున్నా కిందిస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మద్యం దుకాణాల వద్ద ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అనధికార బెల్ట్ షాపులతో మద్యం వ్యాపారం మూడు క్వార్టర్లు..ఆరు బీర్లుగా విరాజిల్లుతోంది. అధికారులు ఇచ్చిన సమయపాలనను కూడా ఇటు బార్లుగానీ, అటు వైన్షాపులకు సంబంఽధించిన వారు ఎవరూ పట్టించుకోకుండా ఉదయం నుంచే అమ్మకాలు సాగిస్తున్నారు.
మద్యం దుకాణాల ప్రక్కన పర్మిట్ రూములు
జిల్లాలో కూటమి సర్కార్లోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, వారి అనుచరులకే మద్యం దుకాణాలు దక్కాయి. దీంతో ఎవరూ అడ్డుకోలేరనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూములు పెట్టి నడిపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పర్మిట్ రూములుకు అనుమతులు లేవని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం యధేచ్ఛగా కూర్చొబెట్టి తాపిస్తున్నారు. ఎకై ్సజ్శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు...వినబడినా వినబడనట్లు ముందుకు పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 120కి పైగా మద్యం షాపులు ఉన్నా ఏదో కొన్నిచోట్ల మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పర్మిట్ రూములను ఏర్పాటు చేశారు.
ఎక్కడ చూసినా వైన్ షాపుల వద్ద సెపరేట్ రూములు
పర్మిషన్ లేకపోయినా ఎవరు ఏమి చేయలేరన్న ధీమా
జిల్లాలో అధిక శాతం కూటమినేతలకే వైన్ షాపులు
ఎకై ్సజ్ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం
జిల్లాలోని మద్యం దుకాణాల్లో పలుచోట్ల బాటిల్పై ఎమ్మార్పీ ధర కాకుండా రూ. 10–30లకు అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల సాధారణ ధరలకే విక్రయాలు సాగిస్తున్నా మరికొన్నిచోట్ల బీరు, ఇతర మద్యం బాటిళ్లపై చిలక్కొట్టుడు కొడుతున్నారు. పైగా షాపుల వారికి అధికార బలం ఉండడంతోఎకై ్సజ్ అధికారులు కూడా వేగంగా స్పందించలేకున్నారన్న ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత మొత్తం అని కాకుండా పెద్ద ఎత్తున ధరలు పెంచి విక్రయిస్తున్నా అడిగే వారు లేకపోవడంతో ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

● ఎమ్మార్పీ ధరలకు మంగళం

● ఎమ్మార్పీ ధరలకు మంగళం