
మంగంపేట బైరెటీస్ గనులు తాకట్టు
రైల్వేకోడూరు అర్బన్ : మంగంపేట బైరెటీస్ గనులను ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 9 వేల కోట్ల అప్పు కోసం తాకట్టుపెట్టి ఇక్కడి ఖనిజ సంపదపై ప్రైవేటు వారికి హక్కు కల్పించి రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలకు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగంపేట గనులు కోడూరు ప్రజల ఆస్తి అని వాటి జోలికి వస్తే ఒక ఇంచ్ కూడా తీసుకోలేరని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన మేధావులు అని చెప్పుకునే కూటమి నాయకులు ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. మంగంపేట గనులపై ప్రభుత్వం పెత్తనం చెలాయించి అప్పులు చేస్తే తీవ్ర ప్రజా ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు