YSRCP IT Wing Conference On 3rd June In Hyderabad - Sakshi
Sakshi News home page

HYD: జూన్‌ 3న వైఎస్సార్సీపీ ఐటీ విభాగ స‌ద‌స్సు

May 26 2023 2:26 PM | Updated on May 26 2023 3:20 PM

YSRCP IT Wing Conference On 3rd June In Hyderabad - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి: వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జూన్ 3వ తేదీ హైద‌రాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెష‌న‌ల్స్‌తో ఒక భారీ స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది. హైటెక్ సిటీలోని బుట్టా క‌న్వెన్ష‌న్ హాలులో ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ స‌ద‌స్సు ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

ఈ స‌మావేశానికి హైద‌రాబాద్‌ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగుల‌ను పెద్ద సంఖ్య‌లో ఆహ్వానిస్తున్నారు. వైస్సార్‌సీపీ ఐటీ విభాగం అధ్య‌క్షులు సునీల్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ సద‌స్సు జ‌రుగుతుంది. ఈ స‌ద‌స్సులో వైస్సార్‌సీపీ పార్టీ బ‌లోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి, ఐటీ ఉద్యోగుల స‌మ‌స్య‌లపైన సమగ్రంగా చ‌ర్చిస్తారు. ఈ స‌ద‌స్సుకు వైస్సార్‌సీపీని అభిమానించే ఐటీ ఉద్యోగులంద‌రూ తప్పకుండా హాజరై సదస్సును విజయవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. స‌ద‌స్సుకు హాజ‌రు కాద‌ల‌చిన‌వారు ముందుగా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌న్నారు. వివరాలకు  7829922666, 7032597980 నెంబర్లలో సంప్రదించాలని ఆయ‌న సూచించారు.

ఇది కూడా చదవండి: పేదల తరుపున ప్రభుత్వం పోరాడింది.. ఇక అమరావతి అందరిది: వెంకటపాలెం సభలో సీఎం జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement