
సాక్షి, గుంటూరు: దివంగత గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SPB) జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.
‘‘తన గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్రముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
తన గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్రముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/KHAoH0cov2
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025
తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు పలు భాషల చిత్రాల్లో ఆయన తన సుమధుర గానంతో సంగీత ప్రియులను, సామాన్య శ్రోతలను దశాబ్దాలపాటు అలరించారు ఎస్పీబీ. సంగీతం నేర్చుకోకపోయినా... దాదాపు యాభైవేల పాటల్నిపాడి గిన్నిస్ రికార్డు సాధించారాయన.