రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan Key Meeting With YSRCP Local Body Representatives | Sakshi
Sakshi News home page

రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ

May 27 2025 6:09 PM | Updated on May 27 2025 7:24 PM

YS Jagan Key Meeting With YSRCP Local Body Representatives

సాక్షి,తాడేపల్లి : రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మండపేట, మదనపల్లె మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ,  పెనుకొండ మండల నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు.  

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ఆహ్వానించారు. వారితోపాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement