వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి.. నిర్మలా శిశు భవన్‌కు వైఎస్‌ జగన్‌ దంపతులు | YS Jagan Family Participated In Raja Reddy Jayanthi Celebrations | Sakshi
Sakshi News home page

వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి.. నిర్మలా శిశు భవన్‌కు వైఎస్‌ జగన్‌ దంపతులు

May 29 2025 2:12 PM | Updated on May 29 2025 3:33 PM

YS Jagan Family Participated In Raja Reddy Jayanthi Celebrations

సాక్షి, విజయవాడ: నేడు దివంగత మహానేత వైఎస్సార్‌ తండ్రి, దివంగత వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

వైఎస్‌ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీసమేతంగా వైఎస్‌ జగన్‌ గురువారం.. విజయవాడలోని నిర్మల శిశు భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్‌లో ఉన్న పిల్లలతో వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సోదరి వైఎస్‌ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు.. పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ పార్టీశ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.

మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్‌ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తన తాత వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. శిశు భవన్‌లో దివ్యంగ చిన్నారులతో గడిపిన వీడియో, ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement