సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మానవాళికి కర్తవ్య బోధ చేసిన భగవద్గీతను ప్రసాదించి, మంచి తరఫున నిలిచి చెడును ఓడించిన భగవానుడు శ్రీకృష్ణుడని వైఎస్ జగన్ అన్నారు. శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నాని పేర్కొన్నారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకోవాలని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలన్నారు.
ఇదీ చదవండి: జన్మాష్టమి రోజు ఈ పనులు చేయడం వెనుక ఇంత అర్థముందా?


