సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో ఉన్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఎస్వీ మోహన్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులు జనక్-శ్రియాలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు.

ఇక, వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జగనన్నకు ఘన స్వాగతం పలికారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్ రాకతో సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్లో సందడి వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి: బాబూ.. పోలవరంపై మీ డ్రామాలు ఆపండి: వైఎస్ జగన్


