సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఒకవేళ మన రాష్ట్రంలో కోవిడ్ బీఎఫ్–7 వేరియంట్ ప్రభావం చూపితే.. సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఆమె విశాఖపట్నం నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, అన్ని విభాగాల అధిపతులు, ఆయా విభాగాల జిల్లా స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. కోవిడ్ మూడు దశలను ఎదుర్కోవడంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. మరోసారి కోవిడ్ ముప్పు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలన్నారు. కోవిడ్ ప్రభావం ప్రజలపై ఏ మాత్రం పడకుండా ముందునుంచీ సీఎం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఒక్క బీఎఫ్–7 కేసు కూడా నమోదు కాలేదు
► రాష్ట్రంలో ప్రస్తుతానికి కోవిడ్ కొత్త వేరియంట్లు ఎక్కడా నమోదు కాలేదు. ఒక్క బీఎఫ్–7 కేసు కూడా నమోదు కాలేదు. విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల ల్యాబ్లో బుధవారం నుంచే పరీక్షలు చేస్తున్నాం. రాష్ట్రంలో 37 వేల ప్రికాషనరీ డోస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవసరమైన మేరకు తెప్పిస్తున్నాం. 60 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలి.
► ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించాం. విధిగా మాస్క్లు ధరించేలా చూడాలి. బీఎఫ్–7ను ఎదుర్కొనే విషయమై వైద్యాధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఎక్కువ సంఖ్యలో టెస్ట్లు చేయాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్లు ఉన్నాయి. పీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు సిద్ధం చేశాం. అత్యవసరమైతే ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు కూడా అందుబాటులోకి తెస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల బెడ్స్ సిద్ధం చేశాం.
► ఆక్సిజన్, మందులు, వెంటిలేటర్లు, ర్యాపిడ్ కిట్లు వంటివి కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. రాష్ట్రంలో ప్రస్తుతం 15.19 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు అందుబాటులో ఉన్నాయి, అవసరమైతే మరిన్ని కొనుగోలు చేయాలి.
► క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆయా చోట్ల కోవిడ్ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలి. 104 కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలి.
సమర్థవంతంగా ఎదుర్కొందాం
Published Fri, Dec 23 2022 4:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement