బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి | Venkatadri Swamy AS New Peetadhipathi Brahmamgari Matam | Sakshi
Sakshi News home page

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

Jun 26 2021 8:02 PM | Updated on Jun 26 2021 8:41 PM

Venkatadri Swamy AS New Peetadhipathi Brahmamgari Matam - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపిక పూర్తయ్యింది. రెండు కుటుంబాల వారసులు ఏకాభిప్రాయానికి వచ్చారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి నియమితులయ్యారు.

చదవండి: ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు
విద్యాభివృద్ధికి ‘సాల్ట్‌’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్

Advertisement
 
Advertisement
Advertisement