రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్‌? | Vangaveeti Ranga Daughter Asha Kiran Clarity On Her Political Entry | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్‌?

Nov 17 2025 5:03 AM | Updated on Nov 17 2025 8:44 AM

Vangaveeti Ranga Daughter Asha Kiran Clarity On Her Political Entry

రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేది తర్వాత ప్రకటిస్తా

ఇకపై అందరికీ అందుబాటులో ఉంటా

వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశా కిరణ్‌

గాందీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): తాను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేది త్వరలో ప్రకటిస్తానని దివంగత ఎమ్మె­ల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్‌ చెప్పారు. ఆదివారం పాలకొల్లులో కార్తీక వన సమారాధనలో పాల్గొనేందుకు పయనమైన ఆమె.. తొలుత విజయ­వాడలోని తమ ఇంటి ఎదుట వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఈ రోజు నుంచే ప్రజా జీవితం ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. ‘ఇకపై అందరికీ అందుబాటులో ఉంటా. ఎవరికైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అండగా ఉంటా’ అని స్ప­ష్టం చేశారు. కుటుంబ బాధ్యతల నేపథ్యంలో కొంత కాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నా­నని, రాధా ర­ంగా మిత్ర మండలితో కొంత గ్యాప్‌ ఏర్ప­డిందని చెప్పా­రు.

ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు తాను ప్రజా జీవితంలోకి వ­స్తు­న్నానని తెలిపారు. తన అన్న వంగవీటి రాధాకృష్ణతో తనకెలాంటి విభేదాలు లేవని, ఇద్దరిదీ రంగా ఆశయ సాధనే లక్ష్యమన్నారు. ఇక­పై రాధా రంగా మిత్ర మండలి, రంగా ఫ్యాన్స్‌­తో కలుస్తానని, అన్ని అంశాలు చర్చిస్తానన్నారు. పబ్లిక్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. రా­జ­కీయ ఆరంగేట్రంపై తర్వాత స్పందిస్తానని చెప్పా­రు. ప్రస్తుతం రాజకీయాల కోసం రాలేదని, సం­దర్భం వచ్చినప్పుడు అందరి సమక్షంలో తన నిర్ణ­యా­న్ని ప్రకటిస్తానని తెలిపారు. అనంతరం ఆమె రాధా రంగా మిత్ర మండలితో కలిసి కార్తీక వన సమారాధన­లో పాల్గొనేందుకు పాలకొల్లు బయలుదేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement