
గాయపడిన వీఆర్వోను ఆస్పత్రికి తరలిస్తున్న సహచర ఉద్యోగులు
ఇద్దరు వీఆర్వోలకు తీవ్ర గాయాలు
విద్యుదాఘాతంతో మరో యువకుడికి గాయాలు
కడప అర్బన్: కడప నగర శివార్లలోని పబ్బాపురంలో మంగళవారం నుంచి జరిగే టీడీపీ ‘మహానాడు’ ప్రాంగణంలో కటౌట్లు కూలడంతో ఇద్దరు వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు. మహానాడు కోసం రెవెన్యూ, పోలీసు, మెడికల్ తదితర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ ఈజీ అశోక్కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం అట్లూరు మండలంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న శీలి దొరబాబు, సుబ్బన్న మహానాడు ప్రాంగణంలోకి మోటార్సైకిల్పై వస్తుండగా భారీ కటౌట్లు కూలి వారిపై పడ్డాయి. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహచర ఉద్యోగులు, పోలీసులు క్షతగాత్రులను కడప రిమ్స్కు తరలించారు.