‘మహానాడు’ ప్రాంగణంలో కూలిన కటౌట్లు | Two VROs injured at Mahanadu program | Sakshi
Sakshi News home page

‘మహానాడు’ ప్రాంగణంలో కూలిన కటౌట్లు

May 27 2025 4:13 AM | Updated on May 27 2025 4:13 AM

Two VROs injured at Mahanadu program

గాయపడిన వీఆర్వోను ఆస్పత్రికి తరలిస్తున్న సహచర ఉద్యోగులు

ఇద్దరు వీఆర్వోలకు తీవ్ర గాయాలు 

విద్యుదాఘాతంతో మరో యువకుడికి గాయాలు

కడప అర్బన్‌: కడప నగర శివార్లలోని పబ్బాపురంలో మంగళవారం నుంచి జరిగే టీడీపీ ‘మహానాడు’  ప్రాంగణంలో కటౌట్లు కూలడ­ం­తో ఇద్దరు వీఆర్వోలు తీవ్రంగా గాయప­డ్డారు. మహానాడు కోసం రెవెన్యూ, పోలీసు, మెడికల్‌ తదితర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని  కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్,  ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలో సోమవారం అట్లూరు మండలంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న శీలి దొరబాబు, సుబ్బన్న మహానాడు ప్రాంగణంలోకి మోటా­ర్‌­సైకిల్‌పై వస్తుండగా భారీ కటౌట్లు కూలి వారిపై ప­డ్డా­యి. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహచర ఉద్యోగులు, పోలీసులు క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement