
విశాఖ,సాక్షి: విశాఖలో దారుణం జరిగింది. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన బాలుడిని రిషి(7)గా పోలీసులు గుర్తించారు.
విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో రిషి నీట మునిగి మృతి చెందాడు. దీంతో రిషిని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా బైక్పై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు సైతం ఆస్పత్రికి వచ్చారు.
అయితే రిషి అప్పటికే మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్ట నిమిత్తం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ యాజమాన్యం తీరుపై బాలుడు మృతిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి మృతిపై తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.