పాఠశాలను విలీనం చేస్తే.. నిరాహార దీక్ష చేస్తాం! | Tirupati District Village People Fire On Nara Lokesh Over Merging Of Primary School | Sakshi
Sakshi News home page

పాఠశాలను విలీనం చేస్తే.. నిరాహార దీక్ష చేస్తాం!

Jun 24 2025 9:30 AM | Updated on Jun 24 2025 10:41 AM

Tirupati district Village people Fire On Nara Lokesh

పుత్తూరు: తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేస్తే నిరాహార దీక్ష చేస్తామని తిరుపతి జిల్లా పుత్తూరు మండలం ఎగువ గూళూరు గ్రామ ప్రజలు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం స్థానిక డిప్యూటీ తహసీల్దార్‌ అశోక్‌రెడ్డికి వినతి పత్రం అందచేశారు. తడుకు పంచాయతీ పరిధిలోని పాఠశాలను శిరుగురాజు పాళెం పంచాయతీలోని దిగువ గూళూరులో ఉన్న పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. 75 ఏళ్లుగా ఉన్న పాఠశాలను మూసివేయడానికి ఎవరికీ అధికారం లేదనీ, ఇక్కడ చదువుతున్న దళిత విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చదువుకొనే పరిస్థితి లేదని చెప్పారు. అధికారులు సానుకూలంగా స్పందించకపోతే అంబేడ్కర్‌ సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు స్పష్టం చేశారు.   

మా పాఠశాలే మాకు ముఖ్యం 


వరికుంటపాడు ఎస్సీకాలనీ వాసుల ఆందోళన
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రవేశపెట్టిన మోడల్‌ స్కూల్‌ విధానాన్ని విద్యావంతులు, ఉపాధ్యాయ లోకం విమర్శిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పలువురు తమ పిల్లలను వేరే పాఠశాలల్లో చేర్పించబోమని స్పష్టం చేస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్సీ కాలనీలో 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది. మోడల్‌ స్కూల్‌ విధానంలో ఎస్సీకాలనీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను వరికుంటపాడు రామాలయం సమీపంలో ఉన్న మోడల్‌ స్కూల్‌లో విలీనం చేశారు. అంతదూరం తమ పిల్లలు ఎలా వెళతారంటూ సోమవారం కాలనీ వాసులు పాఠశాల ఎదుట ఆందోళన చేసి ఉన్నతాధికారులకు వినతిపత్రం పంపారు. మా పాఠశాలే మాకు కావాలంటూ నినాదాలు చేశారు. 
– ఉదయగిరి (వరికుంటపాడు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement