Tirumala Steps Way Close: రెండు రోజులపాటు తిరుమల నడకదారులు బంద్‌

Tirumala Walkway Closed Two Days Over Heavy Rain Alert - Sakshi

సాక్షి, తిరుమల: నవంబర్‌ 17, 18 తేదీల్లో రెండు నడక దారులు మూసి వేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. 'రెండు రోజులపాటు తిరుమలకు వెళ్లే రెండు నడకదారులు (అలిపిరి, శ్రీవారిమెట్టు) తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది. భక్తుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయం గుర్తించి, ఘాట్‌ రోడ్‌ ప్రయాణమే సురక్షితమని' టీటీడీ అధికారులు సూచించారు.

చదవండి: (ఇవి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగం: గౌతమ్‌రెడ్డి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top