Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం | Tirumala Today July 30 2024 Devotees Rush Darshanam Updates Telugu | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం

Jul 30 2024 8:54 AM | Updated on Jul 30 2024 8:54 AM

Tirumala Today July 30 2024 Devotees Rush Darshanam Updates Telugu

తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.

ఇక, సోమవారం శ్రీవారిని  65,874మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 23,782 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement