అనకాపల్లి: జిల్లాలోని ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెంలో టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. ఆశ్రమానికి చెందిన 3.48 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఈ భూ వివాదం కోర్టులో ఉండగా భూమిలోకి దౌర్జన్యంగా వెళ్లారు టీడీపీ నేతలు ఎరకయ్య సతీష్, వారి అనుచరులు. ఈ భూ కబ్జాను స్థానిక మహిళలు అడ్డుకునే యత్నం చేశారు.
అయితే మహిళలు అని చూడకుండా టీడీపీ నేతలు బూతులతో రెచ్చిపోయారు. దీనిపై ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదు. అదే సమయంలో టీడీపీ నేతలకు వత్తాసు పలికారు పోలీసులు.


