టీడీపీకి షాక్‌.. వైఎస్సార్సీపీలోకి నేతల చేరికలు | TDP Congress Leaders joined in YSRCP | Sakshi
Sakshi News home page

టీడీపీకి షాక్‌.. వైఎస్సార్సీపీలోకి నేతల చేరికలు

Nov 24 2025 3:24 PM | Updated on Nov 24 2025 3:56 PM

TDP Congress Leaders joined in YSRCP

సాక్షి, కర్నూలు: ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. చిప్పగిరిలో జరిగిన సమావేశంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వైఎస్సార్‌ సీపీలో చేరిన నేతలు మాట్లాడుతూ.. టిడిపిలో తమకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకత్వం విఫలమైంది. దాంతో వైఎస్సార్‌ సీపీలోకి వస్తున్నాం. టిడిపి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ప్రజలకు ఏమీ చేయలేదు కానీ ప్రజలను మోసం మాత్రం చేసిందని వారు విమర్శించారు. 

ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2029లో ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని నమ్మకం ఉంది అని పేర్కొన్నారు.

ఆలూరు నియోజకవర్గ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం, త్రాగునీటి ఇబ్బందులు ఎక్కువగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటాను. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అని విరుపాక్షి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement