కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు | Specialized medical facilities for Corona infected Journalists | Sakshi
Sakshi News home page

కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు

Aug 1 2020 5:55 AM | Updated on Aug 1 2020 5:55 AM

Specialized medical facilities for Corona infected Journalists  - Sakshi

సాక్షి, అమరావతి: కరోనాకు గురైన పాత్రికేయులు, వారి కుటుంబసభ్యులకు వైద్యం అందించేందుకు ప్రతి జిల్లాలో ఒక ఆసుపత్రిని గుర్తించనున్నామని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో పాత్రికేయులకు వైద్య పరీక్షలు నుంచి అడ్మిట్‌ చేసుకొని వైద్యం అందించే వరకు ప్రతి జిల్లాలో సమాచార శాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి కలిసి.. సహకారం అందించనున్నారని చెప్పారు.

పాత్రికేయులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర స్థాయిలో నోడల్‌ అధికారిగా సమాచార శాఖ సంయుక్త సంచాలకుడు పోతుల కిరణ్‌కుమార్‌ను నియమించామన్నారు. ప్రతి జిల్లాలో సమాచార శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులను నోడల్‌ అధికారులుగా నియమించి వారి ఫోన్‌ నంబర్లను పాత్రికేయులకు అందుబాటులో ఉంచి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement