బెజవాడలో జంట హత్యలు | Rowdy Sheeter Assassinated Two People In Vijayawada, More Details Inside | Sakshi
Sakshi News home page

బెజవాడలో జంట హత్యలు

Jul 17 2025 5:36 AM | Updated on Jul 17 2025 9:00 AM

Rowdy sheeter assassinated two people in vijayawada

పట్టపగలు ఇద్దరిని హత్య చేసిన రౌడీషీటర్‌

మద్యం మత్తులో డబ్బుల విషయమై వాగ్వాదం  

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): విజయవాడ నగరంలో పట్టపగలు ఇద్దరు వ్యక్తులను ఓ రౌడీషీటర్‌  హ­త్య చేశాడు. మద్యం మత్తులో డబ్బు­ల కోసం గొడవపడి.. ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు. విజయవాడ గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్‌ సమీపంలో రౌడీషీటర్‌ జమ్ము కిశోర్, ఎం.రాజు(37), గాదె వెంకట్‌(25) మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. కిశోర్, రాజు విజయవాడకు చెందిన వారు కాగా.. గాదె వెంకట్‌ విజయనగ­రానికి చెందిన వ్యక్తి. బుధవారం మధ్యా­హ్నం ముగ్గురూ తమ గది­లో ఫుల్‌గా మద్యం సేవించారు. ఆ సమయంలో డబ్బు­ల విషయమై ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. 

మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాజు, వెంకట్‌ను కిశోర్‌ కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడు­గు­లో పడి ఉన్న రాజు, వెంకట్‌ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకుసమాచారమిచ్చారు. పోలీసు­లు ఘట­నాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమా­ర్టానికి తరలించారు. కిశోర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిశోర్‌పై ఎనిమిది కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2001లో హత్య కేసుతో తొలిసారి పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కిన కిశోర్‌పై అదే ఏడాది రౌడీషీట్‌ తెరిచినట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement