బెజవాడలో జంట హత్యలు | Rowdy Sheeter Assassinated Two People In Vijayawada, More Details Inside | Sakshi
Sakshi News home page

బెజవాడలో జంట హత్యలు

Jul 17 2025 5:36 AM | Updated on Jul 17 2025 9:00 AM

Rowdy sheeter assassinated two people in vijayawada

పట్టపగలు ఇద్దరిని హత్య చేసిన రౌడీషీటర్‌

మద్యం మత్తులో డబ్బుల విషయమై వాగ్వాదం  

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): విజయవాడ నగరంలో పట్టపగలు ఇద్దరు వ్యక్తులను ఓ రౌడీషీటర్‌  హ­త్య చేశాడు. మద్యం మత్తులో డబ్బు­ల కోసం గొడవపడి.. ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు. విజయవాడ గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్‌ సమీపంలో రౌడీషీటర్‌ జమ్ము కిశోర్, ఎం.రాజు(37), గాదె వెంకట్‌(25) మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. కిశోర్, రాజు విజయవాడకు చెందిన వారు కాగా.. గాదె వెంకట్‌ విజయనగ­రానికి చెందిన వ్యక్తి. బుధవారం మధ్యా­హ్నం ముగ్గురూ తమ గది­లో ఫుల్‌గా మద్యం సేవించారు. ఆ సమయంలో డబ్బు­ల విషయమై ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. 

మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాజు, వెంకట్‌ను కిశోర్‌ కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడు­గు­లో పడి ఉన్న రాజు, వెంకట్‌ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకుసమాచారమిచ్చారు. పోలీసు­లు ఘట­నాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమా­ర్టానికి తరలించారు. కిశోర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిశోర్‌పై ఎనిమిది కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2001లో హత్య కేసుతో తొలిసారి పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కిన కిశోర్‌పై అదే ఏడాది రౌడీషీట్‌ తెరిచినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement