
సాక్షి,తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో కారు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ పైకి కారు దూసుకెళ్లింది. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు ప్రయాణిస్తున్నారు. అయితే, వారు ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ కాకపోవడంతో మొదటి ఘాట్ రోడ్డు 4వ మలుపు సమీపంలో డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స కొనసాగుతోంది.