వాయుగుండంగా మారిన అల్పపీడనం | Rains in North South Coastal Andhra and Rayalaseema for two days | Sakshi
Sakshi News home page

వాయుగుండంగా మారిన అల్పపీడనం

Aug 15 2022 4:45 AM | Updated on Aug 15 2022 4:45 AM

Rains in North South Coastal Andhra and Rayalaseema for two days - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు పయనించింది. ఆదివారం రాత్రికి జార్ఖండ్‌ వైపుగా వెళ్లి జంషెడ్‌పూర్‌కు 70 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

సోమవారం వరకు ఈ వాయుగుండం అదే దిశలో కదులుతూ.. అదే తీవ్రతను కొనసాగిస్తుందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం జార్ఖండ్‌ వైపు మళ్లడంతో దాని ప్రభావం రాష్ట్రం పైన, ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తగ్గిందని తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement