
సాక్షి, విశాఖపట్నం: నేడు, రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ మీదగా ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు,రేపు(శుక్ర,శని)వారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది
ఈనెల 13వ తేదీన రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. ఏపీలో గత మూడు రోజుల్లో సగటున 10 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన మూడు రోజుల్లో రాయలసీమతో పాటు రాష్ట్రంలో సగటున రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా నమోదైంది.