
సాక్షి, అమరావతి: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత అమరవీరులు పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. ప్రసంగం అనంతరం పోలీస్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు సీఎం ఆర్థిక సాయం అందిస్తారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.