జీజీహెచ్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడు సురక్షితం

Police Arrest Newborn Boy Kidnappers In GGH At Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని జీజీహెచ్‌ ఆస్పత్రిలో కిడ్నాపైన పసికందు సురక్షితంగా ఉన్నాడు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నెహ్రూనగర్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. 

గుంటూరు జీజీహెచ్‌లో శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో..4 రోజుల పసికందును కిడ్నాప్‌ చేశారు. అయితే, కొద్ది గంటల్లో శిశువు ఆచూకీ లభించింది. అక్కడ వార్డు బాయ్ మరో మహిళతో కలిసి పసికందును అపహరించినట్టు పోలీస్‌ విచారణలో వెల్లడయ్యింది. పసికందు అపహరణకు గురైన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top