ఇంటి పన్ను కడితేనే పింఛన్‌! | Pensioners face hardship in Chittoor district | Sakshi
Sakshi News home page

ఇంటి పన్ను కడితేనే పింఛన్‌!

Jan 1 2025 3:42 AM | Updated on Jan 1 2025 3:42 AM

Pensioners face hardship in Chittoor district

చిత్తూరు జిల్లాలో పింఛన్‌దారులకు కష్టాలు 

గుడిపాల మండలంలో 27 గ్రామాల్లో ఇదే వైఖరి 

పింఛన్‌ సొమ్ములోంచి జమ చేసుకున్న వైనం

గుడిపాల: ఇంటి పన్నుకు, పింఛన్లకు కూటమి సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివా­లయ సిబ్బంది హుకుం జారీ చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో మంగళవారం 27 పంచాయతీల్లో ఇదే తంతు నడిచింది. పైనుంచి ఆదేశాలొచ్చాయంటూ..సచివాలయాల సిబ్బంది, వీఆర్‌ఓలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటి పన్ను వసూలు చేశా­రు. 

 కొన్ని గ్రామాల్లో ఇంటి పన్ను చెల్లిస్తామని చెప్పిన తర్వాతే పింఛన్‌ సొమ్ము అందజేశారు. అయితే పన్ను చెల్లించిన వారికి ఎక్కడా కూడా రశీదులు ఇవ్వలేదు.  ఇదివరకు ఎప్పు­డూ ఇలా చేయలేదని, ఇలా బలవంతం చేయడం తగదని లబ్ధిదా­రులు ఆవేదన వ్యక్తం చేశారు. 

‘పింఛన్‌ డబ్బులిచ్చేటప్పు­డే ఇంటి పన్ను వసూలు చేయండి. తర్వాత అయితే డబ్బులు లేవు అని చెబుతారు. ఇప్పుడైతే డబ్బులు లేవు అని చెప్పడానికి వారికి ఆస్కారం ఉండదు. ఇది ఇయర్‌ ఎండింగ్‌ అని చెప్పండి’ అని ఒక ప్రజాప్రతినిధి అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయమై స్పందించడానికి అధికారులెవరూ ఇష్టపడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement