క్రీడలతో మానసికోల్లాసం

MP Vijayasai Reddy Participating In YSR Cricket Cup Programme - Sakshi

‘ వైఎస్సార్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌‌’ సన్నాహక సభలో ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాధించారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నెల 21న సీఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం పోర్ట్‌ స్టేడియంలో ‘వైఎస్సార్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌‌’ షెడ్యూల్‌, థిమ్‌ సాంగ్‌, జెర్సీని విడుదల చేశారు. ఆయనతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. (చదవండి: టీడీపీ జాతీయ పార్టీనా?: ఎమ్మెల్యే వంశీ)

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం పెరుగుతుందన్నారు. యువతను అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మంచి క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 20 రోజులు పాటు జరగనున్న ఈ పోటీల్లో 422 టీంలు పాల్గొంటాయని వెల్లడించారు. ప్రతి ఏడాది ‘వైఎస్సార్‌ క్రికెట్ కప్’ పోటీలు ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. (చదవండి: ‘అమరావతి ఉద్యమం ఒక ఫేక్’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top