Taraka Ratna Death: తారకరత్న మృతిపై ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం

Mp Vijayasai Reddy Condolences Death Of Taraka Ratna - Sakshi

సాక్షి, అమరావతి: నందమూరి తారకరత్న మృతిపై ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

తారకరత్న శనివారం రాత్రి కన్ను మూశారు. వైద్యులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని శనివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. తారకరత్న మృతిపై  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
చదవండి: నందమూరి తారకరత్న కన్నుమూత 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top