జాషువా స్ఫూర్తితోనే ముందుకెళుతున్నాం! | Moving Forward With The Spirit Of Joshua | Sakshi
Sakshi News home page

జాషువా స్ఫూర్తితోనే ముందుకెళుతున్నాం!

Sep 29 2023 5:47 AM | Updated on Sep 29 2023 4:33 PM

Moving Forward With The Spirit Of Joshua - Sakshi

సాక్షి, అమరావతి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ఆశయ స్ఫూర్తితోనే వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం ముందుకెళుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జాషువా జయంతిని గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు.

మంత్రి నాగార్జున మాట్లా­డుతూ సమాజంలో అనేక అవమానాలు, వివక్షను ఎదుర్కొని ఎదిగిన మహాకవి జాషువా అని కొనియా­డారు. సమాజాన్ని మేల్కొలిపేలా రచనలు చేశా­­రని చెప్పారు. ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ఉన్నతమైన ఆయన రచనలు గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ఫిరదౌసి వంటి వాటిని అన్ని భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాషువా స్ఫూర్తితో దళిత వర్గాల అభ్యు­న్నతికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. నందిగం సురేష్‌ మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగా తనదైన శైలిలో సమాజాన్ని మేల్కొల్పిన మహనీయుడు జాషువా అని చెప్పారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్‌ల చైర్‌పర్సన్‌లు, డైరెక్టర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement