రికార్డు సృష్టించిన ఏపీ‌.. జనాభాలో 10% మందికి.. | More Than One Lakh Corona Tests Per Million Population In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్ర జనాభాలో 10% మందికి కోవిడ్‌ టెస్టులు

Sep 25 2020 7:53 AM | Updated on Sep 25 2020 8:11 AM

More Than One Lakh Corona Tests Per Million Population In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారిని నియంత్రించేందుకు టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ట్రీట్‌మెంట్‌ వ్యూహంతో ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ దిశగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర జనాభాలో 10 శాతం మందికి కరోనా టెస్టులు చేసి రికార్డు సృష్టించింది. రోజు రోజుకూ టెస్టుల సంఖ్య పెంచుకుంటూ వచ్చి  మిలియన్‌ (10 లక్షలు) జనాభాకు లక్షకు పైగా టెస్టులు చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ కంటే జనాభాలోనూ, వైశాల్యంలోనూ, సాధనసంపత్తిలోనూ మిన్నగా ఉన్న రాష్ట్రాలేవీ ఈ రికార్డును చేరుకోలేకపోయాయి. ('నీకు కరోనా రాను')

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వెలుగుచూసేనాటికి ఒక్క ల్యాబొరేటరీ కూడా లేకపోయినా గత ఆరు నెలల్లో టెస్టులు చేసే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుని ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. దేశంలో జరుగుతున్న ప్రతి వంద టెస్టుల్లో 8 టెస్టులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయంటే కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ ఏవిధంగా ముందుకు వెళ్తోందో తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో 1,00,718 మందికి కోవిడ్‌ టెస్టులు జరుగుతున్నాయి. మొదట్లో మిలియన్‌కు 10వేల మందికి టెస్టులు చేయడానికి 133 రోజులు పట్టగా, తాజాగా ఆ సంఖ్య 7 రోజులకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement