
పెడన: దక్షిణ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఇటీవల నిర్వహించిన మిస్ తెలుగు అమెరికా పోటీల్లో కృష్ణా జిల్లా పెడనకు చెందిన భవిరిశెట్టి ఆనందరావు, పావని దంపతుల కుమార్తె నీహారిక విజేతగా నిలిచిందని అఖిల భారత ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి (ఆప్స్) వ్యవస్థాపకులు డాక్టర్ కొల్లూరి సత్యనారాయణ (చిన్న) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా న్యూయార్క్లో లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో నీహారిక ఎంఎస్ చదువుతోందని తెలిపారు.