‘చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే మా ప్రభుత్వం నిర్మిస్తోంది’

Minister Vellampalli Srinivas Comments On Chandrababu Over Temples In Amaravati - Sakshi

అమరావతి: దేవాలయశాఖలో వినూత్న మార్పులు తెస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల భూములు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్‌ నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టు, ట్రిబ్యునల్‌ కేసుల పరిష్కారానికి న్యాయవాదులను నియమిస్తున్నట్లు తెలిపారు.

దేవాలయాల అభివృద్ధికి కూడా నాడు-నేడు విధానం రూపొందించామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. అదే విధంగా ప్రతి దేవాలయంలోను గోశాలలను ఏర్పాటుచేస్తామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే.. మా ప్రభుత్వం నిర్మిస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే 9 కొత్త దేవాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రసాదం స్కీం ద్వారా ప్రముఖ దేవాలయాల అభివృద్ధి చేస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top