సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు | Mangalagiri Police Given Notices To Sajjala Ramakrishna Reddy | Sakshi
Sakshi News home page

సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు

Oct 16 2024 12:45 PM | Updated on Oct 16 2024 2:45 PM

Mangalagiri Police Given Notices To Sajjala Ramakrishna Reddy

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపు(గురువారం) ఉదయం 10:30 గంటలకు సజ్జల హాజరు కావాలని నోలీసులు ఇచ్చారు. 
 

సజ్జలకు పోలీసుల నోటీసులు

 

Advertisement
 
Advertisement
Advertisement