ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదని.. | Lovers Lost Their Lives After Refusing To Accept Love Marriage | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదని..

Sep 30 2025 7:23 AM | Updated on Sep 30 2025 7:41 AM

Lovers Lost Their Lives After Refusing To Accept Love Marriage

పల్నాడు జిల్లా: ఇద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి బతకాలనుకున్నా­రు. కానీ పెద్దలు అంగీకరించకపోవటంతో వేర్వేరు రైళ్ల కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన కోడె గోపి(20), గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన ప్రియాంక (20) గుంటూరులోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

కానీ కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పడంతో పెళ్లి చేసుకున్నారు. దీనిని వారి పెద్దలు అంగీకరించకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోపి.. శనివారం సాయంత్రం పేరేచర్ల సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక కూడా ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యువతి తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో.. గోపి కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని కూడా దమ్మాలపాడుకు తీసుకువచ్చారు. ఇద్దరికీ అంత్యక్రియలు పూర్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement