కడప ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం

Kadapa Pulivendula Tour CM Jagan Reach Kadapa Airport Over - Sakshi

సాక్షి, కడప: నేటి నుంచి రెండు రోజులపాటు పులివెందుల నియోజకవర్గం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.20 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకున్నారు సీఎం జగన్‌. క‌డప‌ఎయిర్‌పోర్టు, ఇడుపుల‌పాయ‌లో సీఎం వైఎస్‌ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.  

ఇడుపులపాయ వైఎస్సార్‌ ఎస్టేట్‌ చేరుకున్న అనంతరం 4.50 గంటల వరకు పార్టీ నేతలతో మాట్లాడారు. 5.00 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.20 గంటలకు ఇడుపులపాయ వైయ‌ఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌లు స్వాగ‌తం ప‌లికారు. 

చదవండి: ఇక సొంత ఊరే.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top