పులివెందుల జెడ్పీటీసీకి రీ–పోలింగ్‌ నిర్వహించండి | Kadapa MP YS Avinash Reddy letter to the State Election Commissioner | Sakshi
Sakshi News home page

పులివెందుల జెడ్పీటీసీకి రీ–పోలింగ్‌ నిర్వహించండి

Aug 13 2025 5:07 AM | Updated on Aug 13 2025 5:07 AM

Kadapa MP YS Avinash Reddy letter to the State Election Commissioner

14 న కౌంటింగ్‌ నిలిపివేయండి

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకం చేసింది

బయటి నుంచి వచ్చిన టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు

వాస్తవ ఓటర్లు ఓటు వేయకుండా నిరోధించారు

పోలింగ్‌ ఏజెంట్లు ఫారాలు సమర్పించకుండా అడ్డుకున్నారు

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడింది

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి లేఖ

సాక్షి, అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేక­పోయారని, అందువల్ల రీ–పోలింగ్‌ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం లేఖ రా­శారు. పోలింగ్‌ సందర్భంగా టీడీపీ చేసిన అరా­చ­కాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు విని­యోగించుకోలేకపోయారని వివరించారు. 

అధి­కా­ర పార్టీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడింద­న్నా­రు. పోలింగ్‌కు ముందే టీడీపీ బయ­టి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గూం­డాలను పోలింగ్‌ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో మో­హరించిందని వివ­రించారు. దీని మీద పదే పదే ఫిర్యాదు చేసినప్ప­టికీ, ఎటువంటి చర్యలు తీసు­కో­లేదన్నారు. వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు ఫారాలను సమ­ర్పించడానికి పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా  టీడీపీ గూండాలు అడ్డుకున్నారని వెల్ల­డించారు. ఓటర్లను సైతం ఓటు హక్కు వినియో­గించుకోకుండా నిరోధించారన్నారు. 

పోలీసు యం­త్రాంగం పోలింగ్‌ ఏజెంట్లు, ఓటర్లకు రక్షణ కల్పించడానికి బదులుగా, అధికార పార్టీ నాయ­కుల అరాచకా­లకు అండగా నిలిచిందని చెప్పారు. పులివెందుల జెడ్పీ­టీసీ వైఎస్సార్‌­సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌ రెడ్డి బయటకు రాకుండా టీడీపీ గూండాలు ఇంటిని చుట్టుము­ట్టారని తెలిపారు. పులివెందుల జెడ్పీ­­టీసీ పరిధి­లోని 15 పోలింగ్‌ కేంద్రాల్లో అధి­కార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement