ఇప్పటంలో జనసేన మూకల ఓవరాక్షన్‌.. గుడిలోకి వెళ్లి తాళాలు వేసి.. | Janasena Workers Overaction Ippatam Village | Sakshi
Sakshi News home page

ఇప్పటంలో జనసేన మూకల ఓవరాక్షన్‌.. గుడిలోకి వెళ్లి తాళాలు వేసి..

Mar 5 2023 8:59 AM | Updated on Mar 5 2023 9:07 AM

Janasena Workers Overaction Ippatam Village - Sakshi

తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా ఇప్పటంలో గతంలో తొలగించకుండా మిగిలిపోయి­న ఆక్రమణల విషయంలో జనసేన మూకలు శని­వారం మరోసారి గ్రామంలో చిచ్చుపెట్టేందుకు యత్నించారు. అధికారులు ఎంతచెప్పినా వినకపోవడంతోపాటు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. సదరు ఆక్రమణలు ప్రభుత్వ భూ­మి­లోనివేనని అధికారులు స్పష్టంచేయ­డం.. పోలీసుల హెచ్చరికలతో జనసేన మూకలు తోకముడిచాయి. 

వివరాల ప్రకారం.. గతంలో నానా రభస సృష్టించి ఇప్పటంలో అభివృద్ధి పనులను జనసేన శ్రేణులు అడ్డుకోవడంతో మంగళగిరి–తాడేపల్లి మున్సి­పల్‌ కార్పొరేషన్‌ (ఎంటీఎంసీ) అధికారులు అప్పట్లో కొన్ని ఆక్రమణలను తొలగించలేదు. వీటిని తిరిగి శనివారం తొలగించేందుకు సిద్ధమవుతుండగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జనసేన, టీడీపీ శ్రేణులు గ్రామంలో మరోసారి రగడ సృష్టించేందుకు ప్ర­యత్నించారు. ముఖ్య­మంత్రిని, ప్రభుత్వా­న్ని రాయడానికి వీల్లేని భాషలో ఇష్టానుసారం దూషించారు. కానీ, ఎంటీఎంసీ అధి­కా­రులు మాత్రం సంయమనం పాటించారు. 

అంతేకాక.. తామేమీ ప్రైవేట్‌ ఆస్తుల­ను తొలగించడంలేదని.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించుకున్న ప్రహరీ గోడలు, మెట్లు, వ్యాపార సముదాయాలు మాత్రమే తొలగిస్తున్నామని స్ప­ష్టం­­చేశారు. ఇంతలో అది ప్రభుత్వ భూమి అయితే ఆధారాలు చూపాలని జనసేన శ్రేణులు డిమాండ్‌ చేయగా అధికారులు అందుకు సరేనన్నారు. అదే సమయంలో గ్రామంలో బయట వ్యక్తులు ఎవరూ ఉండకూడ­దని పోలీసులు హె­చ్చ­­రించడంతో ఒక్క­సారిగా అక్కడ ఉద్రి­క్తత ఏర్పడింది. వారిని అడ్డుకునే ప్రయత్నంలో జనసేన మూకలు రెచ్చిపోగా పోలీ­సులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరి­కొందరు అక్కడి రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. 

ఇంతలో ఎంటీఎంసీ అధికా­రులు 1916 నాటి రికార్డులను తీసుకొచ్చి వారికి చూపించారు. దీంతో.. అధికారులు ఆక్రమణలపై చేసిన మార్కింగ్‌ కొలతలు.. రికార్డుల్లో ఉన్న కొలతలు ఒకటేనని తేలిపోయింది. ఇక ఏం మాట్లాడాలో అర్ధంకాక అధి­­కారులతో జనసేన మూకలు వాదనకు దిగాయి. పోలీసులు హెచ్చరించడంతో వారు బయటకొచ్చి వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణి­గింది. ఇదిలా ఉంటే.. జనసేన శ్రేణులు గుడిలోకి వెళ్లి తాళాలు వేసుకోవడం.. ప్రభుత్వం, సీఎంపై నానా మాటలు అనడంతో గ్రామానికి చెందిన మహిళలు బహిరంగంగానే ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement