
గుంటూరు ఈస్ట్: గుంటూరు లక్ష్మీపురంలో జనసేన కార్యకర్తల దాష్టీకమిది. ప్రైవేటు హాస్టల్ బోర్డుపై కులం పేరు ఉందన్న కారణంతో జనసేన కార్యకర్తలు ఆ హాస్టల్ యజమానిని కొట్టి మోకాళ్ల మీద కూర్చొబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. జనసేన కార్యకర్తల దురాగతాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్లోకి మంగళవారం కొందరు జనసేన కార్యకర్తలు కర్రలతో ప్రవేశించారు.
హాస్టల్ యజమానిని బయటకు పిలిచి బోర్డు పైన ఉన్న ఓ సామాజికవర్గం పేరును తొలగించాలని బెదిరించారు. హాస్టల్ యజమాని అందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులైన జనసేన కార్యకర్తలు మూకుమ్మడిగా హాస్టల్ యజమానిపై దాడి చేశారు. వదిలిపెట్టాలని హాస్టల్ యజమాని ప్రాధేయపడినా వదల్లేదు. పైగా జనసేన కార్యకర్తలు హాస్టల్ యజమానిని మోకాళ్ల మీద కూర్చోబెట్టి, వారి కాళ్ళు పట్టించుకున్నారు. అయితే జనసేన కార్యకర్తలకు భయపడిన హాస్టల్ యజమాని ఈ ఘటనపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేశాడు.
గుంటూరులోని లక్ష్మీపురంలో హాస్టల్ నేమ్ బోర్డ్ లో రెడ్డి అనే పేరు ఉన్నందుకు హాస్టల్ మీద కర్రలతో, రాళ్ళతో దాడి చేసి ఆ హాస్టల్
యజమానిని కొట్టి బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్ళు పట్టించుకున్న @JanaSenaParty గూండాలు.
ఇదేనా నీ కొత్తతరం రాజకీయం అంటే @PawanKalyan ? pic.twitter.com/cVK38l1ksB— YSR Congress Party (@YSRCParty) June 6, 2024